తల్లి అనారోగ్యం చూసి తట్టుకోలేక..

7 Aug, 2016 10:51 IST|Sakshi
ఏలూరు (మెట్రో): తల్లికి శస్త్రచికిత్స జరగడంతో ఆమెను ఐసీయూలో చూసిన కుమారుడు మనస్తాపంతో పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కాళ్ల మండలం సీసలి గ్రామానికి చెందిన మహ్మద్‌ బాషా తల్లి మున్నీ కొద్దికాలంగా మెదడుకు సంబంధించిన అనారోగ్యంతో బాధపడుతోంది.

ఈ క్రమంలో ఆమెకు శుక్రవారం శస్త్రచికిత్స చేశారు. దీంతో బాషా మనస్తాపం చెంది పురుగు మందు తాగాడు. అతడిని స్థానికులు ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 
 
మరిన్ని వార్తలు