శ్రీకాకుళం: ప్రభుత్వ ఉద్యోగం రాలేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా పొందురు సమీపంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. లావేరు మండలం మురపాక గ్రామానికి చెందిన జనార్ధన్ గత కొంత కాలంగా ప్రభుత్వోద్యోగ అన్వేషణలో ఉన్నాడు. ఈ క్రమంలో ఉద్యోగం రాకపోవడంతో.. తీవ్ర మనస్తాపానికి గురై రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు.