చార్జింగ్ పెడుతూ..యువకుడి మృతి

29 Nov, 2015 12:33 IST|Sakshi

ఖానాపూర్: సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ ఓ యువకుడు మృతిచెందిన సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఖానాపూర్ మండలం సోమర్‌పేటలో సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతుండగా ప్రమాదవశాత్తూ కరెంటు షాక్ కొట్టింది. దీంతో బూక్యా కబీర్ దాస్(26) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. యువకుడి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.

మరిన్ని వార్తలు