రైలు ఎక్కే ప్రయత్నంలో విషాదం

18 Dec, 2016 21:54 IST|Sakshi

రేణిగుంట: కదులుతున్న రైలు ఎక్కుతూ ప్రమాదవశాత్తూ రైలు కిందపడి ఓ యువకుడు మృతిచెందాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా రేణిగుంట రైల్వేస్టేషన్‌లో ఆదివారం చోటుచేసుకుంది. మృతుడి జేబులో ఉన్న ఆధార్ కార్డు ద్వారా యువకుడు ఖమ్మం పట్టణానికి చెందిన ఆశిష్ అబ్రహం(19)గా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు ఆశిష్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు