రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

15 Nov, 2015 12:15 IST|Sakshi

మహేశ్వరం: రంగారెడ్డి జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతిచెందాడు. మహేశ్వరం మండలం సర్థార్ నగర్ గేట్ వద్ద  కారు టైరు పేలడంతో అదుపుతప్పి ముందు వెళుతున్న బైక్‌ను ఢీకొట్టింది.

దీంతో బైక్‌పై  వెళుతున్న ముగ్గురు యువకుల్లో ఆనంద్(28) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
 

>
మరిన్ని వార్తలు