గోరంట్ల : పట్టణంలోని కదిరి–హిందూపురం రహదారిలోని హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద శనివారం సాయంత్రం ద్విచక్రవాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓడీసీ మండలం నాయనికోటకు చెందిన యువకుడు ప్రసన్నకు తీవ్ర గాయాలయ్యాయి. ద్విచక్రవాహనంలో బెంగుళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.క్షతగాత్రున్ని స్థానికులు 108లో ఆస్పత్రికి తరలించారు.