మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు వైఎస్ జగన్ హామీ

10 Jan, 2016 11:18 IST|Sakshi
మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు వైఎస్ జగన్ హామీ

అనంతపురం : రాష్ట్రంలోని మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. వైఎస్ జగన్ అనంతపురం జిల్లాలో చేపట్టిన రైతు భరోసా యాత్రలో భాగంగా ఉప్పరపల్లిలో ఆయన్ని ఆదివారం ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులు కలిశారు. తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయించాలని వైఎస్ జగన్ని సదరు ఉద్యోగులు కోరారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ పైవిధంగా స్పందించారు. 

అలాగే తమ కులాన్ని బీసీల్లో కలిపేందుకు సహకరించాలని కాపు, తెలగ, బలిజ సంఘం నేతలు కూడా వైఎస్ జగన్ కలసి విజ్ఞప్తి చేశారు. అందుకు తన వంతు సహకారం అందిస్తానని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. వైఎస్ జగన్ అనంతపురం జిల్లాలో చేపట్టిన రైతు భరోసా యాత్రం ఆదివారం ఐదో రోజుకు చేరింది. ఉప్పరపల్లిలో రైతు మారుతి ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఉప్పరపల్లిలో వైఎస్ జగన్ను డీఎస్సీ అభ్యర్థులు కలిశారు. ఉపాధ్యాయ నియామకాలను వెంటనే జరిపేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వైఎస్ జగన్ను కోరారు.

మరిన్ని వార్తలు