19న విజయనగరంలో వైఎస్ జగన్ యువభేరి

16 Dec, 2016 03:08 IST|Sakshi
19న విజయనగరంలో వైఎస్ జగన్ యువభేరి

విజయనగరం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 19న విజయనగరంలో యువభేరీ జరగనుంది. పూల్ బాగ్ రోడ్డులోని జగన్నాథ ఫంక్షన్ హాల్లో యువభేరి నిర్వహించనున్నట్టు వైఎస్ఆర్సీపీ నేతలు కోలగట్ల వీరభద్రస్వామి, ధర్మాన కృష్ణదాసులు తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఆవశ్యకతను తెలియజేసేందుకే యువభేరి నిర్వహించనున్నట్టు వైఎస్ఆర్ సీపీ నేతలు పేర్కొన్నారు.

అనంతరం ఇటీవల హైదరాబాద్లోని నానక్రాంగూడలో ఏడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో బాధితుల  కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. ఈ మేరకు చిలకపల్లి, సుభద్ర గ్రామాల్లోని బాధిత కుటుంబాలను వైఎస్ జగన్ కలుసుకుంటారని వీదభద్రస్వామి, ధర్మాన కృష్ణ ప్రసాద్  తెలిపారు.

మరిన్ని వార్తలు