శ్మశానవాటికలో శ్రమదానం చేసిన ఎమ్మెల్యే భూమన

3 Jul, 2013 13:13 IST|Sakshi

తిరుమల : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి బుధవారం తిరుమలలోని శ్మశాన వాటికలో శ్రమదానం చేశారు. స్థానికులను తిరుమల నుంచి ఖాళీ చేయించే కార్యాక్రమాన్ని విరమించుకోవాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మనిషికి ఇళ్లు ఎంత  ముఖ్యమో శ్మశానవాటిక కూడా అంతే అవసరమన్నారు.

 

తిరుమల స్థానికులదే అనడానికి శ్మశాన వాటికే నిదర్శనమన్నారు. శ్మశాన వాటికను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక శ్రద్ద వహించాలని భూమన అన్నారు. లేకుంటే అక్కడే ఆందోళన చేస్తామని భూమన ఈ సందర్భంగా టీటీడిని హెచ్చరించారు. ఈ విషయం తెలుసుకున్న హెల్త్ అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.  
 

>
మరిన్ని వార్తలు