19న వైఎస్సార్‌ సీపీ జిల్లా ప్లీనరీ

3 Jun, 2017 01:59 IST|Sakshi
19న వైఎస్సార్‌ సీపీ జిల్లా ప్లీనరీ
సాక్షి ప్రతినిధి, ఏలూరు : వైఎస్సార్‌ సీపీ జిల్లా ప్లీనరీని ఈనెల 19న ఏలూరులో నిర్వహిస్తున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్ల నాని ప్రకటించారు. ఆ రోజు ఉదయం 10నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు, చర్చించాలి్సన అంశాలపై పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలతో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఏయే తీర్మానాలు ప్రవేశపెట్టాలి, విధి విధానాలు ఏమిటనే అంశాలపై మాట్లాడారు. ఇప్పటివరకూ జిల్లాలోని నియోజకవర్గాల్లో జరిగిన ప్లీనరీల తీరు, మిగిలిన నియోజకవర్గాల్లో నిర్వహించా ల్సిన ప్లీనరీలపై చర్చించారు. నియోజకవర్గ ప్లీనరీలు ముగిసిన తర్వాత వాటిలో చర్చించిన అంశాలను క్రోడీకరించి, జిల్లా ప్లీనరీలో తీర్మానాలుగా ప్రవేశపెడతామని నాని తెలిపారు. జిల్లా ప్లీనరీని ఎక్కడ నిర్వహించాలి, ఏ స్థాయి వరకూ ఆహ్వానాలు పంపాలి, ఎంతమందిని ఆహ్వానించాలన్న అంశాలపై సమావేశంలో చర్చించారు. టీడీపీ అధికారం చేపట్టిన అనంతరం గడచిన మూడేళ్లలో జిల్లాలో పెరిగిన అవినీతి, ప్రజలపై దాడులు, చివరకు పోలీసులపై దాడులకు తెగబడుతున్న వైనాలను ఎండగట్టడంతోపాటు జిల్లా సమస్యలపై చర్చించేందుకు ప్లీనరీని వేదికగా చేసుకోవాలని నిర్ణయిం చారు. సమావేశంలో పార్టీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త కోటగిరి శ్రీధర్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు ముసునూరి ప్రసాదరాజు, కొట్టు సత్యనారాయణ, గ్రంధి శ్రీనివాస్, పాతపాటి సర్రాజు, తెల్లం బాలరాజు, పుప్పాల వాసుబాబు, తలారి వెంకట్రావు, కొఠారు రామచంద్రరావు, కవురు శ్రీనివాస్, దయాల నవీన్‌బాబు, గుణ్ణం నాగబాబు, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ రామకృష్ణ, పార్టీ నాయకుడు తోట గోపి పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు