'చంద్రబాబు ప్రచార ఆర్భాటాలకే పరిమితం'

22 Apr, 2016 21:02 IST|Sakshi

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రచార ఆర్భాటాలకే పరిమితమయ్యారని వైఎస్ఆర్ సీపీ నేతలు విమర్శించారు. హంద్రీ-నీవాను కేవలం చెరువులకు పరిమితం చయడానికి చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని వైఎస్ఆర్ సీపీ నేతలు శంకర్ నారాయణ, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. హంద్రీ-నీవా ఆయకట్టుకు పనులను ఆపడం దారుణమన్నారు. ఆయకట్టుకు నీళ్లివ్వకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.
 

మరిన్ని వార్తలు