మిస్టరీగా మారిన మంజుల మృతి కేసు

16 Jan, 2016 15:17 IST|Sakshi
మిస్టరీగా మారిన మంజుల మృతి కేసు

అనంతపురం: మిస్టరీగా మారిన మంజుల(మీనాక్షి) అనుమానాస్పద మృతి కేసులో సమగ్ర దర్యాప్తు జరపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఈ కేసులో టీడీపీ నేతల ప్రమేయంపై విచారణ జరపాలంటూ శనివారం అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్ సీపీ నేతలు ఆందోళన చేపట్టారు. ఎస్పీ కార్యాలయం వద్ద బైఠాయించారు. దోషులను కఠినంగా శిక్షించాలని మంజుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.

నిందితులు రాము(వెంకటరమణ చౌదరి), రీనివాస్ చౌదరిలో ఉన్నారు. మిస్టరీగా మారిన మంజుల మృతిపై సమగ్ర విచారణ జరపాలని అనంతపురం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు శుక్రవారం డీఎస్పీని కలసి వినత పత్రం సమర్పించారు.

మరిన్ని వివరాలకు... మంజుల ఆత్మ‘హత్య’లో మరో కోణం

మరిన్ని వార్తలు