వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, బంధువుల ఆందోళన

18 Dec, 2015 13:08 IST|Sakshi

పులివెందుల: వైఎస్సార్ జిల్లాలో శుక్రవారం పెద్ద ఎత్తున వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఆందోళన నిర్వహించారు. బెంగుళూరులో మృతిచెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తల మృతదేహాలతో బంధువులు, పార్టీ కార్యకర్తలు తొండూరు పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.

నలుగురి మృతికి కారణమైన కొండాపురం సీఐ రవిబాబుపై వెంటనే చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిలతో పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు, మృతుల బంధువులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు