'అవినీతి సొమ్ముతో బాబు ఎమ్మెల్యేలను కొంటున్నారు'

6 May, 2016 19:43 IST|Sakshi

కర్నూలు : అవినీతి సొమ్ముతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను కొంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బుగ్గన రాజేంద్రనాథ్, ఐజయ్య, గౌరు వెంకటరెడ్డి ఆరోపించారు. శుక్రవారం కర్నూలులో వారు విలేకర్లతో మాట్లాడుతూ... కొందరు స్వార్థం కోసం పార్టీని వీడుతున్నారని విమర్శించారు. సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఫిరాయింపులకు పాల్పడుతున్నారన్నారు.
 

>
మరిన్ని వార్తలు