'అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు'

14 Jul, 2016 19:01 IST|Sakshi

తిరుపతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల పట్ల చంద్రబాబు సర్కార్ కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. అధికార పార్టీ బెదిరింపులు, అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని ఆ పార్టీ ఎంపీ మిథున్రెడ్డి, ఎమ్మెల్యేలు రోజా, నారాయణ స్వామి స్పష్టం చేశారు. గురువారం చిత్తూరు జిల్లా సత్యవేడు సబ్ జైలులో ఉన్న పార్టీ నేత కే జే కుమారును ఆ పార్టీ వారు పరామర్శించారు. అనంతరం వారు విలేకర్లతో పై విధంగా స్పందించారు. ఈ సందర్భంగా వారు కె జె కుమార్ అరెస్ట్ను ఖండించారు.

>
మరిన్ని వార్తలు