కర్నూలు: పాణ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గౌరు సుచరితకు మాతృవియోగం కలిగింది. సుచరిత తల్లి బాలనాగమ్మ (70) సోమవారం మృతి చెందారు. గత కొంత కాలంగా బాలనాగమ్మ అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాగా గౌరు సుచరితకు పలువురు సంతాపం తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.