'బాబు రైతులను నట్టేట ముంచారు'

25 Jan, 2016 18:41 IST|Sakshi

హైదరాబాద్: కొత్తగా నిర్మిస్తున్న రాజధాని ప్రాంతంలో ఎక్స్ ప్రెస్ హైవేల రూట్ మార్చేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యలు చేయడం దారుణమని మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆర్కే(ఆర్ రామకృష్ణ) అన్నారు.

నాడు మామ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబునాయుడు ఇప్పుడు రైతులను నమ్మించి నట్టేట ముంచారని ఆరోపించారు. చంద్రబాబు అలాంటి వ్యాఖ్యలు చేయకుండా పునరాలోచించాలని హితవు పలికారు.
 

>
మరిన్ని వార్తలు