'చంద్రబాబు పాలనలో ముస్లింలకు అన్యాయం'

13 Mar, 2016 14:35 IST|Sakshi
'చంద్రబాబు పాలనలో ముస్లింలకు అన్యాయం'

కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముస్లింలకు అన్యాయం చేయాలని చూస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి ఆరోపించారు.

కర్నూలులో ఆదివారం ఆయన మాట్లాడుతూ....దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ముస్లిం మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే దాన్ని చంద్రబాబు నీరుగార్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సొంతపనుల కోసం రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారు కానీ మైనార్టీలకు మాత్రం నిధులు కేటాయించడం లేదని మోహన్రెడ్డి విమర్శించారు.

>
మరిన్ని వార్తలు