'హంద్రీ నీవా పూర్తికై ఉద్యమం ఉధృతం'

4 Feb, 2016 15:45 IST|Sakshi

అనంతపురం: హంద్రీ నీవా ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్ రెడ్డి అల్టిమేటం జారీ చేశారు. ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలన్న డిమాండ్తో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వెల్లడించారు. ఇందులో భాగంగా ఈ నెల 20, 21 తేదీల్లో వజ్రకరూర్లో జనజాగరణ చేపట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు తొలిదశ ఆయకట్టుకు చంద్రబాబు నీరు ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. అలాగే డిస్ట్రిబ్యూటరీ పనులను నిలిపేయడానికి కారణాలు చెప్పాలని విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.
 

మరిన్ని వార్తలు