'చీప్ పాలిటిక్స్ కు లొంగం'

26 Feb, 2016 13:52 IST|Sakshi
'చీప్ పాలిటిక్స్ కు లొంగం'
హైదరాబాద్: వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, తమ ప్రయాణం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంటే అని ఎమ్మెల్యేలు కోన రఘుపతి, ముస్తఫా సృష్టం చేశారు. శుక్రవారం వారు మాట్లాడుతూ' టీడీపీలోకి చేర్చుకోవడానికి రకరకాల ఆఫర్స్ ఇస్తున్నారు. అటువంటి చీప్ పాలిటిక్స్ కి లొంగే వ్యక్తులం కాదు. ప్రజలు వారి సమస్యలు పరిష్కరించడం కోసం మమ్మల్నీ ఎమ్మెల్యేలుగా గెలిపించారు. వైఎస్ఆర్ సీపీ సింబల్ పై గెలిచిన మేము ప్రతిపక్షంగా ప్రభుత్వంపై పోరాడతాం. అధికార పార్టీకి వంత పాడుతున్న ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం మానుకోవాలి' అని సూచించారు.
 
మరిన్ని వార్తలు