'తండ్రీకొడుకులిద్దరిది మైండ్ గేమ్'

12 Feb, 2016 14:39 IST|Sakshi

చిత్తూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, నారాయణస్వామి శుక్రవారం చిత్తూరులో నిప్పులు చెరిగారు. తెలంగాణలో టీడీపీ క్లోజ్ కావడంతో ప్రజల దృష్టి మరల్చేందుకు ఏపీలో తండ్రీకొడుకులిద్దరూ మైండ్గేమ్ మొదలుపెట్టారని ఆరోపించారు. రానున్న కాలంలో ఏపీలో టీడీపీ నుంచి వలసలు ప్రారంభమవుతాయని వారు జోస్యం చెప్పారు.

>
మరిన్ని వార్తలు