ప్రధానికి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లేఖ

28 Oct, 2015 12:23 IST|Sakshi

ఒంగోలు: పొగాకు రైతుల ఆత్మహత్యలపై ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్సార్సీపీ ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లేఖ రాశారు. ఈ లేఖ ద్వారా రైతుల సమస్యలను వైవీ సుబ్బారెడ్డి ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.

రైతు ఆత్మహత్యలు, సమస్యలపై ప్రత్యేకంగా లేఖలో ఎంపీ ప్రస్తావించారు. పొగాకు రైతులను ఆదుకోవాల్సిన అవసరముందని ఆయన తెలిపారు. లేఖ కాపీని కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, నిర్మలా సీతారామన్, రాధా మోహన్ సింగ్కు కూడా వైవీ సుబ్బారెడ్డి పంపారు.

 

మరిన్ని వార్తలు