వైఎస్సార్‌ సీపీ పరిశీలకుల నియామకం

24 Aug, 2016 11:31 IST|Sakshi
ఏలూరు (ఆర్‌ఆర్‌ పేట) : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గడపగడపకూ వైఎస్సార్‌ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు జిల్లాకు చెందిన పలువురు నాయకులను వివిధ నియోజకవర్గాల పరిశీలకులుగా నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఒక ప్రకటన లో తెలిపింది. పరిశీలకులుగా నియమితులైన నాయకులు పార్టీ జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని ఆధ్వర్యంలో పనిచేస్తారని పేర్కొంది.
 
నియోజకవర్గం    పరిశీలకుని పేరు
ఏలూరు            మాజేటి సురేష్‌కుమార్‌
దెందులూరు      ముప్పిడి సంపత్‌కుమార్‌
ఉంగుటూరు       గంటా ప్రసాదరావు
పోలవరం           గన్నమని జనార్దనరావు
చింతలపూడి      బండి పట్టాభి రామారావు (అబ్బులు)
కొవ్వూరు          పోతుల రామతిరుపతి రెడ్డి
గోపాలపురం      పోల్నాటి శ్రీనివాస్‌ బాబు (బాబ్జి)
నిడదవోలు        ఊదరగొండి చంద్రమౌళి
తణుకు             మేడపాటి చంద్రమౌళీశ్వర్‌రెడ్డి
తాడేపల్లిగూడెం    చెలికాని రాజమోహనరావు (రాజాబాబు)
ఆచంట              రుద్రరాజు బాల సూర్యనారాయణరాజు (పీడీ రాజు)
నరసాపురం        చెల్లెం ఆనందప్రకాష్‌
పాలకొల్లు           బలగం సేతుబంధన సీతారామ్‌
భీమవరం          నడపన చినసత్యనారాయణ
ఉండి                వి.సూర్యనారాయణరాజు (కనకరాజు సూరి)
 
మరిన్ని వార్తలు