‘వెంకయ్య విచిత్రంగా మాట్లాడుతున్నారు’

8 Nov, 2016 15:11 IST|Sakshi
‘వెంకయ్య విచిత్రంగా మాట్లాడుతున్నారు’

గుంటూరు : ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమన్న కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రంగా ఆక్షేపించారు. ఆయన మంగళవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘ప్రత్యేక హోదా-ఆంధ్రుల హక్కు’ నినాదంతో విశాఖలో జరిగిన ’జై ఆంధ్రప్రదేశ్’ సభను ప్రజలు విజయవంతం చేశారన్నారు. ఆ సభ విజయవంతం కావడంతో వెంకయ్య విచిత్రంగా మాట్లాడుతున్నారని అన్నారు.

ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని వెంకయ్య అనడం సరికాదని అంబటి పేర్కొన్నారు.  హోదా కాదని...ఏపీలో బీజేపీ ముగిసిన అధ్యాయమని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేవరకూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశ్రమించరని అంబటి  స్పష్టం చేశారు.

 

మరిన్ని వార్తలు