– ఎన్నికల అధికారిని కోరిన వైఎస్సార్టీఎఫ్
అనంతపురం ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని కేడర్ల ఉపాధ్యాయులకూ ఓటుహక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్లాల్ను వైఎస్సార్ టీఎఫ్ నేతలు కోరారు. ఈ మేరకు శుక్రవారం హైదరబాద్లో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఓబుళపతి భన్వర్లాల్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్లతోపాటు ప్రాథమిక పాఠశాలల్లో పని చేస్తున్న ఎస్జీటీలకూ అవకాశం కల్పించే అంశాన్ని పరిశీలించాలని అందులో విజ్ఞప్తి చేశారు.