29న జోనల్‌ స్థాయి క్రికెట్ క్రీడాకారులు ఎంపిక

27 Jul, 2016 17:27 IST|Sakshi

శామీర్‌పేట్‌: మేడ్చల్‌ జోనల్‌ స్థాయి క్రికెట్‌ క్రీడాకారుల ఎంపిక కుత్బుల్లాపూర్‌ మండలం గండిమైసమ్మ పరిధిలోని జ్యోతిరావు పూలే స్టేడియంలో ఈ నెల 29న నిర్వహించనున్నట్లు స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ జోనల్‌ కార్యదర్శి అరుణజ్యోతి బుధవారం సాయంత్రం తెలిపారు. పూలే స్టేడియంలో అండర్‌ 14, అండర్‌ 17 స్థాయి క్రికెట్‌ పోటీల్లో పాల్గొనే క్రీడాకారుల ఎంపిక నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ ఎంపికలో పాల్గొని తమ క్రీడానైపుణ్యాన్ని ప్రదర్శించాలని కోరారు. విద్యార్థులు తమ స్కూల్‌ బోనఫైడ్‌తో ఎంపిక ప్రదేశానికి హజరుకావాలన్నారు.

మరిన్ని వార్తలు