ఎబోలాపై అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితి

14 Aug, 2014 02:49 IST|Sakshi
ఎబోలాపై అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితి

జాతీయం
 రక్షణ, రైల్వేల్లో విదే శీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి రక్షణ రంగంలో 49 శాతం, రైల్వేల్లో కొన్ని విభాగాల్లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్ర కేబినెట్ ఆగస్టు 6న అంగీకరించింది. రక్షణ రంగంలో ప్రస్తుతం 26 శాతం వరకు అనుమతి ఉంది. రైల్వేల్లో హైస్పీడ్ రైళ్ల వ్యవస్థ, సబర్బన్ కారిడార్లు, సరకు రవాణా లైన్ల వంటి విభాగాల్లో 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి ఇచ్చేందుకు కేంద్రం ఆమోదించింది.
 
 బాల నేరస్థుల విచారణపై జువెనైల్ జస్టిస్ బోర్డుకు అధికారం తీవ్రమైన నేరాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న 16-18 ఏళ్ల మధ్య ఉన్న వారిని సంస్కరణ గృహానికి పంపాలా లేదా సాధారణ కోర్టులో విచారించాలా అనే విషయంపై నిర్ణయం తీసుకునే అధికారం జువెనైల్ జస్టిస్ బోర్డుకు అప్పగిస్తూ కేంద్ర కేబినెట్ ఆగస్టు 6న నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత బాలనేరస్థుల చట్టం ప్రకారం మైనర్లు ఎంత తీవ్ర నేరాలకు పాల్పడినా వారిపై కోర్టులో విచారణ జరపడానికి వీలులేదు. వారికి గరిష్ట శిక్షగా మూడేళ్ల నిర్బంధం మాత్రమే ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వారికి మరణశిక్ష విధించడానికి వీలులేదు. ఢిల్లీలో జరిగిన నిర్భయ సామూహిక అత్యాచార కేసులో మైనర్ కూడా నిందితుడుగా ఉన్న సంఘటనతో బాల నేరస్థుల చట్టాన్ని సవరించాలన్న డిమాండ్ ముందుకొచ్చింది.
 
 దేశంలో విద్యుత్ సౌకర్యం
 లేనివారు 40 కోట్ల మంది దేశంలో మూడింట ఒక వంతు మందికి విద్యుత్ సౌకర్యం లేదని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆగస్టు 7న లోక్‌సభకు తెలిపారు.ప్రస్తుతం ఎనిమిది కోట్ల గృహాలకు విద్యుత్ సౌకర్యం లేదు. అంటే 40 కోట్ల మందికి విద్యుత్ అందుబాటులో లేదని ప్రకటించారు. దేశంలో విద్యుత్ లేని గ్రామాల సంఖ్య 12,468. వీటిలో అత్యధికంగా బీహార్‌లో 6,882 గ్రామాలున్నాయని మంత్రి వివరించారు.
 
 మిజోరం గవర్నర్ బేనీవాల్ తొలగింపు
 మిజోరం గవర్నర్ కమలా బేనీవాల్‌ను తొలగిస్తూ ఆగస్టు 6న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉత్తర్వులు జారీచేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కమలా బేనీవాల్ ఆ రాష్ట్ర గవర్నర్‌గా వ్యవహరించారు. కాగా గుజరాత్ గవర్నర్ ఓం ప్రకాశ్ కోహ్లీ గోవా గవర్నర్‌గా ఆగస్ట్ 7న అదనపు బాధ్యతలు స్వీకరించారు.
 
 క్రీడలు
 ప్రపంచకప్ ఆర్చరీలో దీపిక బృందానికి  స్వర్ణ పతకం పోలెండ్ దేశం వ్రోక్లా నగరంలో జరుగుతున్న ప్రపంచకప్ ఆర్చరీలో దీపిక కుమారి నేతృత్వంలోని మహిళల రికర్వ్ జట్టు స్వర్ణ పతకం సాధించింది. ఆగస్టు 10న జరిగిన ఫైనల్లో దీపికా కుమారి, బొంబేలా దేవీ, లక్ష్మీరాణిలతో కూడిన భారత మహిళల జట్టు మెక్సికో జట్టుపై విజయం సాధించింది. కాగా జయంత తాలుక్‌దార్ సారథ్యంలోని భారత పురుషుల జట్టు రజతం సాధించింది.
 
 రద్వాన్ స్కా కు డబ్ల్యూటీఏ రోజర్స్ కప్ టైటిల్
 డబ్ల్యూటీఏ రోజర్స్ కప్ టెన్నిస్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను రద్వాన్ స్కా (పోలెండ్) గెలుచుకుంది. టొరంటోలో ఆగస్టు 11న జరిగిన ఫైనల్‌లో వీనస్ విలియమ్స్ (అమెరికా)ను రద్వాన్ స్కా ఓడించింది.
 
 సోంగాకు ఏటీపీ రోజర్స్ కప్ టైటిల్
 ఏటీపీ రోజర్స్ కప్ పురుషుల సింగిల్స్ టెన్నిస్ టైటిల్‌ను జోవిల్ ఫ్రైడ్ సోంగా (ఫ్రాన్స్) కైవసం చేసుకున్నాడు. ఆగస్టు 11న జరిగిన ఫైనల్‌లో రోజర్ ఫెదరర్(స్విట్జర్లాండ్) ను సోంగా ఓడించాడు.
 
 లెడెకి మరో ప్రపంచ రికార్డు
 అమెరికా స్వివ్ముర్ కేటీ లెడెకి మరో సంచనలం సృష్టించింది. యుూఎస్ స్విమ్మింగ్ జాతీయ చాంపియున్‌షిప్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. శనివారం జరిగిన వుహిళల 400 మీటర్ల ఫ్రీస్టరుుల్ రేసును 17 ఏళ్ల ఈ అమ్మాయి 3ని.58.86 సెకన్లలో పూర్తి చేసి కొత్త ప్రపంచ రికార్డు నమోదు చేసింది. గతంలో ఈ రికార్డు ఇటలీ స్వివ్ముర్ ఫెడ్రికా పెల్లెగ్రిని (3:59.15 సెకన్లు) పేరిట ఉండేది. హైటెక్ బాడీ సూట్‌ను నిషేధించిన తర్వాత పెల్లెగ్రిని ఈ రికార్డు నెలకొల్పింది. ఇదే టోర్నీలో 800 మీటర్లు. 1500 మీటర్ల ఫ్రీస్టరుుల్‌లోనూ కొత్త ప్రపంచ రికార్డులు సృష్టించిన లెడెకి... జానెట్ ఇవాన్స్ (1998 నుంచి 2006 మధ్యలో) తర్వాత ఏకకాలంలో వుూడు విభాగాల్లో ప్రపంచ రికార్డులు నమోదు చేసుకున్న స్విమ్మర్‌గా గుర్తింపు పొందింది.
 
 ఎకానమీ
 అత్యంత విలువైన భారత బ్రాండ్ టాటా  దేశంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా టాటా గ్రూపు నిలిచింది. రూ. 1,26,000 కోట్లతో టాప్ 100 భారత బ్రాండ్లలో అగ్రస్థానం సొంతం చేసుకొంది. రెండు, మూడు స్థానాల్లో ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ నిలిచాయి. ఈ వివరాలను కన్సల్టింగ్ సంస్థ బ్రాండ్ ఫైనాన్స్ ఇండియా తన వార్షిక సర్వేలో వెల్లడించింది. వంద కంపెనీల మొత్తం బ్రాండ్ విలువ 92.6 బిలియన్ డాలర్లు కాగా అందులో అయిదో వంతు టాటా గ్రూపుదే కావడం విశేషం.
 
 అత్యంత ధనికుల దేశాల్లో
 భారత్‌కు ఎనిమిదో స్థానం  అత్యంత ధనవంతులున్న దేశాల్లో ప్రపంచంలో భారత్ ఎనిమిదో స్థానంలో ఉందని న్యూ వరల్డ్ వెల్త్ అనే సంస్థ తన నివేదికలో వెల్లడించింది. భారత్‌లో 14,800 మంది కుబేరులున్నట్లు తెలిపింది. ఈ నివేదిక ప్రకారం అమెరికా, చైనా, జర్మనీ దేశాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. 2,700 మంది కుబేరులతో అత్యధిక ధనవంతులున్న తొలి 25 నగరాల్లో ముంబయికి చోటు దక్కింది. 15,400 మంది ధనవంతులతో హాంకాంగ్  అగ్రస్థానంలో నిలిచింది.
 
 వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచిన ఆర్‌బీఐ

 రిజర్వ్ బ్యాంకు ఆగస్టు 5న ప్రకటించిన పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ప్రాధాన్యతినిస్తూ రెపోరేటును 8 శాతం, రివర్స్ రెపోరేటు 7 శాతం , సీఆర్‌ఆర్ (క్యాష్ రిజర్వ్ రేషియో- నగదు నిల్వల నిష్పత్తి) ని 4 శాతం వద్దనే ఉంచింది. చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి (ఎస్‌ఎల్‌ఆర్) ని అరశాతం తగ్గించింది. దీంతో ఇది 22.5 శాతం నుంచి 22 శాతానికి చేరింది. దీనివల్ల బ్యాంకింగ్ వ్యవస్థలోకి రూ. 40 వేల కోట్లు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటును 5.5 శాతంగా ఆర్‌బీఐ అంచనా వేసింది. సీపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం 2015 జనవరి నాటికి 8 శాతానికి, 2016 నాటికి 6 శాతానికి పరిమితం చేయడం లక్ష్యంగా పేర్కొంది.
 
 సదస్సులు
 తూర్పు ఆసియా విదేశాంగ మంత్రుల సదస్సు తూర్పు ఆసియా విదేశాంగ మంత్రుల నాలుగో సదస్సు మయన్మార్‌లోని నేపితాలో ఆగస్టు 10న జరిగింది. సదస్సులో పాల్గొన్న భారత విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ దక్షిణ చైనా సముద్రంలో చైనా బలప్రయోగాన్ని వ్యతిరేకించారు. ఈ విషయంలో బ్రూనై, మలేిషియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, తైవాన్‌లతో చైనా పోరాడుతోంది. దక్షిణ చైనా సముద్రంలో వియత్నాం నుంచి అనుమతి పొంది భారత్ జరుపుతున్న చమురు తవ్వకాలపై కూడా చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది.
 
 వాతావరణ మార్పులపై
 బేసిక్ దేశాల మంత్రుల సమావేశం బ్రెజిల్, దక్షిణ ఆఫ్రికా, భారత్, చైనా (బేసిక్) దేశాల మంత్రుల స్థాయి సమావేశం న్యూఢిల్లీలో ఆగస్టు 7,8 తేదీల్లో జరిగింది. వాతావరణ మార్పులు, ఐక్యరాజ్యసమితి కార్యాచరణ అంగీకారానికి సంబంధించిన ప్రధాన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.
 
 
 సైన్‌‌స అండ్ టెక్నాలజీ
 తోకచుక్కను చేరిన తొలి అంతరిక్ష నౌక  తోకచుక్కను చేరిన తొలి అంతరిక్ష వాహక నౌకగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన రొసెట్టా అరుదైన ఘనతను సాధించనుంది. (చర్యుమోవ్- జిరాసిమెంకో) అనే పేరుగల తోక చుక్కను ఈ నౌక 10 సంవత్సరాల 5 నెలల 4 రోజుల సుదీర్ఘ ప్రయాణం అనంతరం చేరువైంది. ప్రస్తుతం ఇది తోకచుక్క ఉపరితలానికి 100 కిలోమీటర్ల దూరంలో సంచరిస్తుంది. ఈ ఏడాది నవంబర్ నాటికి దానిపై ల్యాండ్ కానుంది. ఈ తోకచుక్కను 1969లో కనుగొన్నారు.
 
 గ్లోబల్ వార్మింగ్‌కు మానవ చర్యలే
 ప్రధాన కారణం: ఐపీసీసీ గ్లోబల్ వార్మింగ్ (భూతాపం)కు మానవులే ప్రధాన కారణమని ఐక్యరాజ్య సమితికి చెందిన వాతావరణ మార్పులపై అంతర్ ప్రభుత్వ ప్యానెల్ (ఐపీసీసీ ) ఆగస్టు 6న విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. వాతావరణ మార్పులు మనుషుల ఆరోగ్యం, దక్షిణ ఆసియాలోని ఆవాసాలు, మౌలిక సదుపాయాలపై ప్రభావం చూపుతున్నాయని తెలిపింది. 1950 నుంచి ఆసియాలో చల్లగా ఉండే రాత్రీపగలు రోజుల సంఖ్య తగ్గి, వేడితో కూడిన రాత్రీపగలు రోజుల సంఖ్య పెరిగాయని తెలిపింది.
 
 
 అంతర్జాతీయం
 2020 నాటికి బీజింగ్‌లో బొగ్గు వినియోగం నిషేధం చైనా రాజధాని బీజింగ్‌లో 2020 నాటికి బొగ్గు వినియోగాన్ని నిషేధించాలని బీజింగ్ మున్సిపల్ పర్యావరణ పరిరక్షణ బ్యూరో ఆగస్ట్ 4న నిర్ణయించింది. బీజింగ్‌తోపాటు మరో ఐదు జిల్లాల్లో బొగ్గు వినియోగాన్ని పూర్తిగా నిషేధించే ప్రణాళికకు రూపకల్పన చేసింది. చైనాలోని ప్రధాన పట్టణాల్లో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించడమే దీని ఉద్దేశం.
 
 సూయజ్ కాలువ జలమార్గ
 నిర్మాణ  పనులు ప్రారంభం 145 ఏళ్ల చరిత్ర గల సూయజ్ కాలువ జలమార్గాన్ని తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఈజిప్ట్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించిన నిర్మాణ పనులను ఆ దేశాధ్యక్షుడు అబ్దుల్ ఫత అల్-సిసి ఆగస్టు 6న ప్రారంభించారు. దీంతో ఐరోపా, ఆసియా ఖండాల మధ్య వర్తకం మరింత విస్తరించనుంది. సూయజ్ కాలువను తొలిసారిగా 1869లో ప్రారంభించారు. ఇది ఈజిప్ట్‌లోని మెడిటేరేనియన్, ఎర్ర సముద్రాలను కలిపే కృత్రిమ జలమార్గం. దీనివల్ల వర్తకుల నౌకలు, ఓడలు ఆఫ్రికా ఖండాన్ని చుట్టిరాకుండా నేరుగా ఐరోపాను చేరుకోవచ్చు.
 
 ఎబోలాపై అంతర్జాతీయ వైద్య ఎమర్జెన్సీ
 పశ్చిమ ఆఫ్రికాలో విజృంభిస్తున్న ఎబోలా మహమ్మారిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆగస్టు 8న అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఈ వైరస్ ప్రభావిత దేశాలకు ప్రపంచ దేశాలు సాయం చేయాలని డబ్ల్యూహెచ్‌వో డెరైక్టర్ జనరల్ మార్గరెట్ చాన్ కోరారు. గత నాలుగు దశాబ్దాల్లో తీవ్రమైన, సంక్లిష్టమైన మహమ్మారి ఇదేనని పేర్కొన్నారు. 2009లో స్వైన్‌ఫ్లూ వ్యాపించిన సమయంలోనూ, గత మేలో పోలియో విషయంలోనూ ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఎబోలా వ్యాప్తి గినియాలో గత మార్చిలో ఆరంభమైంది. అక్కడినుంచి సియోర్రాలియోన్, లైబీరియా, నైజీరియాలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించింది.
 
 
 వార్తల్లో వ్యక్తులు
 అర్జున అవార్డుల ఎంపిక కమిటీ ఛైర్మన్‌గా కపిల్‌దేవ్ భారత మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్ నిఖంజీ అర్జున అవార్డుల ఎంపిక కమిటీ చైర్మన్‌గా ఆగస్టు 7న ఎంపికయ్యారు. 2014లో దేశంలో అన్ని క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లను ఎంపికచేసి,అవార్డులను ప్రకటించేందుకు ఈ కమిటీ పనిచేస్తుంది.
 
 ఎడ్వెర్డ్ స్నోడెన్‌కు రష్యా మూడేళ్ల ఆశ్రయం
 అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మాజీ నిర్వాహకుడు ఎడ్వర్డ్ స్నోడెన్‌కు మూడేళ్లపాటు తమ దేశంలో ఆశ్రయం కల్పించాలని రష్యా ఆగస్టు 7న నిర్ణయించింది. స్నోడెన్‌కు 2013లో ఏడాది పాటు ఆశ్రయం ఇచ్చింది. దాని కాలపరిమితి ఈ ఏడాది ఆగస్టు 1నాటికి ముగియడంతో, మరో మూడేళ్ల పాటు పొడిగించింది. ఇంటెలిజెన్స్ అధికారిగా పనిచేస్తూ 2013లో జాతీయ భద్రత రహస్యాలను బట్టబయలు చేసినందుకు స్నోడెన్‌పై అమెరికా కఠిన చర్యలకు ఉపక్రమించింది. వీటి నుంచి తప్పించుకునేందుకు అతడు హాంకాంగ్ పారిపోయాడు. అక్కడి నుంచి మాస్కోకు చేరుకున్నాడు.
 
 అంతర్జాతీయ రెజ్లింగ్ రిఫరీ సస్పెన్షన్
 అంతర్జాతీయ రెజ్లింగ్ రిఫరీ వీరేందర్ మాలిక్‌ను ద రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆగస్ట్ 4న సస్పెండ్ చేసింది. గ్లాస్గోలో జరిగిన కామన్‌వెల్త్ క్రీడల్లో లైంగిక దాడి అభియోగాల కింద అరెస్ట్ అయిన విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తూ రెజ్లింగ్ ఫెడరేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. విచారణలో మాలిక్ దోషిగా తేలితే అన్ని జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్ల నుంచి శాశ్వత బహిష్కరణకు గురవుతాడు.
 
 భారతీయ యువ రచయితకు
 ప్రతిష్ఠాత్మక పురస్కారం భారతీయ యువ రచయిత నిఖిల్ చంద్వానీ (20)కి ప్రతిష్ఠాత్మక అమెరికన్ లిటరరీ  ఫోరం సొసైటీ పురస్కారం లభించింది. ఆయన రాసిన కోడెడ్ కాన్‌స్పిరసీ అనే నవలకు ఈ పురస్కారం దక్కింది.
 

>
మరిన్ని వార్తలు