సామర్థ్యాలకు సానపెట్టాల్సిందే...

7 Aug, 2014 03:22 IST|Sakshi
సామర్థ్యాలకు సానపెట్టాల్సిందే...

నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) పద్ధతిలో జరిగే పరీక్షా విధానంలో జీవశాస్త్రానికి 50 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఈ 50 మార్కులలో 40 మార్కులకు పబ్లిక్ పరీక్ష నిర్వహిస్తారు. మిగతా 10 మార్కులు పాఠశాలలో నిర్వహించే రూపణ మూల్యాంకనం లేదా ఫార్మేటివ్ అసెస్‌మెంట్ ద్వారా ఉపాధ్యాయులు నిర్ణయిస్తారు.

మార్కులు కేటాయించిన విధానం
పబ్లిక్ పరీక్ష    40
రూపణమూల్యాంకనం    10
మొత్తం మార్కులు    50
పరీక్ష వ్యవధి     2 గంటల 30 నిమిషాలు
ప్రశ్న పత్రాన్ని చదవడానికి అదనంగా 15 నిమిషాల సమయం ఇస్తారు.

వార్షిక ప్రశ్నపత్రం-మార్కుల స్వరూపం
ప్రశ్న రకంప్రశ్నల     మార్కులు    మొత్తం
సంఖ్య        మార్కులు
వ్యాసరూప ప్రశ్నలు    4    4    16
లఘు రూప ప్రశ్నలు    6    2    12
స్వల్పసమాధాన ప్రశ్నలు    7    1    7
బహుళైచ్ఛిక ప్రశ్నలు    10    1/2    5
మొత్తం మార్కులు            40
40 మార్కుల్లో ఉత్తీర్ణులవ్వాలంటే విద్యార్థి 14 మార్కులు సాధించాలి.

ప్రామాణికం.. ఫార్మేటివ్ అసెస్‌మెంట్:
 బయలాజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్‌లకు కలిపి ఒక్కో రూపణ మూల్యాంకనం 20 మార్కులకు ఉంటుంది. వీటిలో ప్రయోగాల నిర్వహణకు 5 మార్కులు, పాఠ్యపుస్తకంలోని ప్రశ్నల సమాధానాలకు 5, ప్రాజెక్ట్ వర్క్‌కు 5, మిగతా 5 మార్కులు ఉపాధ్యాయుడు నిర్వహించే పరీక్షకు కేటాయించారు.అయితే బయలాజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్‌లకు వేర్వేరుగా పరీక్ష నిర్వహిస్తారు. కాబట్టి ఈ రెండు సబ్జెక్ట్‌లకు కలిపి ఉండే 20 మార్కులను సమంగా విభజించారు. ఈ నేపథ్యంలో బయలాజికల్ సైన్స్‌కు 10 మార్కులు కేటాయించారు. ఈ 10 మార్కులకు 3.5 (మూడున్నర) మార్కులు సాధించిన వారిని ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు. కానీ ప్రస్తుతం ఈ నిబంధనను తొలగించారు.

సామర్థ్యాలకు సాన:
పబ్లిక్ పరీక్షలో ఉండే 40 మార్కుల్ని సాధించాలంటే.. విద్యార్థి కచ్చితంగా అన్ని రకాల ప్రశ్నలకు సమాధానాలు రాసే సామర్థ్యాలను మొదటి నుంచే సాధించాలి. ఈ క్రమంలో విద్యార్థి నిర్వహించే ప్రయోగాలు, ప్రాజెక్ట్ వర్క్ అధిక మార్కుల సాధనకు దోహదపడతాయి. పాఠ్యపుస్తకంలోని అంశాలను నేర్చుకోవడానికి మాత్రమే పరిమితం కాకుండా ఉపాధ్యాయుడు ఇచ్చే ప్రశ్నలకు సమాధానాల సాధన, సంబంధిత అంశాలపై ప్రాజెక్ట్‌లు నిర్వహిస్తే సబ్జెక్ట్ సామర్థ్యాలు పెరుగుతాయి. ప్రయోగ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనాలి. తద్వారా ఆలోచనా సామర్థ్యం మెరుగవుతుంది.

ప్రయోగ నిర్వహణ అంశాలు:
విద్యార్థులు రికార్డులను జాగ్రత్తగా నిర్వహించాలి. ఇందులో ప్రయోగానికి సంబంధించి ఉద్దేశం, పరికరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రయోగ విధానం, నమోదు, ఫలితాల విశ్లేషణ, సాధారణీకరణం వంటి అంశాలను పొందుపరచాలి. ప్రయోగానికి 4 మార్కులు, రికార్డు రాసినందుకు 6 మార్కులు కేటాయించారు.

రాత అంశాలు:
నేర్చుకున్న అంశాలపై సొంత అభిప్రాయాలను జోడిస్తూ సమాధానాలను రాయడం ప్రాక్టీస్ చేయాలి. ఈ క్రమంలో నోట్‌బుక్‌లో సొంతంగా సమాధానాలు రాసినందుకు 5 మార్కులు, పటాలు గీసినందుకు 2 మార్కులు, భాషాదోషాలు లేకుండా ఉంటే 3 మార్కులు ఇస్తారు.

ప్రాజెక్ట్ పని:ఇందులో విద్యార్థి వినడం/చదివిన విషయాల గురించి కాకుండా చేయడం లేదా అనుభవం ద్వారా నేర్చుకున్న అంశాలకు సంబంధించి ప్రాజెక్ట్‌ను నిర్వహించాల్సి ఉంటుంది. ఇందులో ప్రాజెక్ట్ జట్టు బాధ్యతలకు సంబంధించి 3 మార్కులు, నివేదిక (నిర్వహించిన కార్యక్రమాలను క్రమ పద్ధతిలో రాయడం)కు 5 మార్కులు, ప్రాజెక్ట్ గురించి ప్రసంగించినందుకు 2 మార్కులు కేటాయించారు.

లఘు పరీక్ష:
ఇందులో విద్యార్థుల విద్యా ప్రమాణాలను పరీక్షిస్తారు. ఇందుకు 20 మార్కులు కేటాయించారు.
మూల్యాంకనం ముఖ్యమే:విద్యార్థి ప్రతి రూపణ మూల్యాంకనంలో మంచి మార్కులు సాధించడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఇవి వార్షిక పరీక్షల్లో అధిక మార్కులతోపాటు మంచి గ్రేడును సాధించడానికి దోహదపడతాయి. ప్రతి రూపణ మూల్యాంకనంలో ఎక్కువ మార్కులు సాధించడ ం కష్టంతో కూడిన పని కాదు. ఎందుకంటే ఈ మూల్యాంకనం సిలబస్ పరిధి చాలా తక్కువ. అదే విధంగా ఉపాధ్యాయుడు ఇచ్చే ప్రాజెక్టులు, విద్యార్థులు సొంతంగా రాసే జవాబులు, పాఠశాలలో నిర్వహించే ప్రయోగాలు ఇవన్నీ ఒకదానితో ఒకటి అంతర సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఈ పరీక్షల్లో సులువుగా మార్కులు సాధించవచ్చు. ప్రాజెక్ట్ వర్క్, ప్రయోగశాల కృత్యాలకూ మార్కులను కేటాయించారు. కాబట్టి వీటి నిర్వహణలో విద్యార్థి తన తోటి మిత్రులు, కుటుంబ సభ్యులు లేదా ఉపాధ్యాయుని సాయంతో సమర్థవంతంగా నిర్వహిస్తే, అధికమార్కులను పొందొచ్చు.

తప్పనిసరి
ప్రతి విద్యార్థి అన్ని రూపణ మూల్యాంకన పరీక్షలకు హాజరుకావాలి. సవరించిన నిబంధనల ప్రకారం అన్నిరూపణ మూల్యాంకన పరీక్షలలో ఉత్తీర్ణత సాధించాల్సిన అవసరం లేదు. కానీ ఇవి స్కోరింగ్‌కు దోహదపడతాయి. ప్రతి రూపణ మూల్యాంకన పరీక్షలకు సంబంధించి ల్యాబ్ రికార్డ్స్, ప్రాజెక్ట్ వర్క్ నోట్ బుక్, స్లిప్‌టెస్ట్ నోట్‌బుక్‌లను ఉపాధ్యాయుని సాయంతో జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. ప్రశ్నలకు జవాబులు సొంతంగా రాయడానికి ప్రయత్నించాలి. సందేహాల నివృత్తిలో తోటి విద్యార్థుల లేదా ఉపాధ్యాయుని సహకారం తీసుకోవడానికి వెనుకాడవద్దు.

గమనించాల్సినవి
విద్యా ప్రమాణాల ఆధారంగా ప్రశ్న పత్రం ఉం టుంది. గతంలో మాదిరిగా పాఠ్యాంశాలకు భార త్వం ఉండదు. కాబట్టి అన్ని పాఠాలను చదవాలి.పాఠ్యపుస్తకంలో ఉన్న అన్నీ ప్రశ్నలు.. పరీక్షలో ఏ విధంగా అడగవచ్చో ముందే ఊహించుకుని సమాధానాలను ప్రాక్టీస్ చేయాలి.ఉపాధ్యాయుడు నిర్వహించే మూల్యాంకన పరీక్షలను రాస్తే వ్యాసరూప, లఘు, స్వల్ప ప్రశ్నలకు సమాధానాలు ఎలా రాయాలో అవగాహన ఏర్పడుతుంది. బయాలజీలో మార్కుల సాధనలో పటాలు కీలకం. కాబట్టి విద్యార్థి పటాలపై ఆసక్తి పెంచుకోవాలి. పటంలోని భాగాలు. అవి నిర్వర్తించే విధుల గురించి క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. మనసులో ఉన్న జవాబును నిస్సందేహంగా రాయవచ్చు. ఎందుకంటే నూతన పరీక్షా విధానం బహుళ సమాధాన ప్రశ్నలకే ప్రాధాన్యం ఇస్తుంది.

ఉదాహరణ:
ప్రశ్న: దేహంలో కొవ్వుశాతం అధికమైతే ఏం జరుగుతుంది?సమాధానం: స్థూల కాయత్వానికి దారితీస్తుంది. రక్తపీడనం పెరుగుతుంది. గుండె పోటు వస్తుంది. ప్రశ్న: పోషణ పాఠం చదివిన తర్వాత నీ ఆహార అలవాట్లలో ఎలాంటి మార్పును కోరుకుంటున్నావు?సమాధానం: రోజూ సరైన సమయానికి ఆహారం తీసుకుంటాను. తినే తిండిలో పీచు పదార్థాలకు ప్రాధాన్యం ఇస్తాను. సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్నితీసుకుంటాను.

కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు
1.మీ ఊరి ఆర్‌ఎంపీ దగ్గరకు వచ్చిన పది మంది రోగుల రక్త పీడనాన్ని కనుగొని, ఎవరు అధిక సిస్టోలిక్, డయాస్టోలిక్ పీడనాలు కలిగి ఉన్నారో జాబితా తయారు చేయండి.
2.నిత్య జీవితంలో మనకు లభించే సహజ పదార్ధాలతో జీర్ణవ్యవస్థ మోడల్‌ను రూపొందించండి.
3.ఆల్కలాయిడ్‌లు, టానిన్‌లను ఇచ్చే మొక్కల పత్రాలను సేకరించి హెర్బేరియం తయారు చేయండి.
4.వివిధ రకాల జంతువుల దంత సూత్రాలను తెలిపే సమాచారాన్ని పాఠశాల గ్రంథాలయం, అంతర్జాలం నుంచి సేకరించి నివేదిక సిద్ధం చేయండి.5.జీవవైవిధ్యానికి సంబంధించి గతంలో మీ ఊరిలో ఉండి, ప్రస్తుతం అంతరించిపోయిన మొక్కల, జంతువుల పట్టికను పొందుపరచి కారణాలు రాయండి.
6.సహజ వనరులకు సంబంధించి దగ్గరలోని ఎరువుల, క్రిమి సంహారకాల దుకాణానికి వెళ్లి ఏటా వారు అమ్మే క–{తిమ ఎరువులు, క్రిమిసంహారకాల పేర్లను, ఎంత పరిమాణంలో విక్రయించారో తెలిపే పట్టికను రూపొందించండి.ఙఞ్చట7.గ్రామ పెద్దల సాయంతో ఆదర్శరైతు అంటే ఏమిటో తెలుసుకొని, అతన్ని ఆదర్శరైతుగా ఎందుకు గుర్తించారో వివరంగా రాయండి.

విద్యార్థి చేయాల్సినవి
 చేస్తూ నేర్చుకోవడంతో మరెన్నో కొత్త విషయాలను తెలుసుకోవచ్చు.ుండా నివేదికలు రూపొందించాలి.
కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా సంబంధిత అంశాలు ఉన్న అనుబంధ పుస్తకాలను చదవడం అలవాటు చేసుకోవాలి. సైన్స్ క్లబ్ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనాలి. ప్రాజెక్ట్ విషయంలో ఉపాధ్యాయుని సహకారంతోపాటు గ్రంథాలయం, అంతర్జాలం (ఇంటర్నెట్) సహాయం తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల విషయంపై లోతైన అవగాహన ఏర్పడుతుంది. తరగతిలో ఉపాధ్యాయుడు బోధించే పాఠ్యాంశాన్ని ముందే క్షుణ్నంగా చదివి ముఖ్యమైన పదాలను, భావనలను నోట్స్‌లో రాసుకోవాలి. విద్యా ప్రమాణాలలోని ప్రశంస, నిజ జీవిత వినియోగం, జీవ వైవిధ్యాలకు సంబంధించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రశ్నలను అధ్యయనం చేయాలి. ముఖ్యంగా విద్యార్థులు ప్రాజెక్ట్, ప్రయోగశాల నిర్వహణకు సంబంధించి ఏమైనా సమస్యలుంటే ఉపాధ్యాయునితో చర్చించి పరిష్కరించుకోవాలి.
 

మరిన్ని వార్తలు