భారతదేశ చరిత్ర (స్వాతంత్య్రోద్యమం)

4 Nov, 2016 23:34 IST|Sakshi
భారతదేశ చరిత్ర (స్వాతంత్య్రోద్యమం)

ఇండియన్  హిస్టరీ
 
 సిల్వర్ టంగ్‌‌డ ఆరేటర్ అని ఏ జాతీయ నాయకుడిని పిలుస్తారు? - సురేంద్రనాథ్ బెనర్జీ
 హంటర్ విద్యా కమిషన్ సభ్యుడైన భారతీయుడు? - ఆనందమోహన్ బోస్
 నేతాజీ స్థాపించిన పార్టీ?      - ఫార్వర్‌‌డ బ్లాక్
 వందేమాతరాన్ని ఆంగ్లంలోకి అనువదించినవారు?         - అరవింద ఘోష్
 ఆనందమఠ్‌లో ప్రధాన ఇతివృత్తం?
 - సన్యాసుల తిరుగుబాటు
 అలీపూర్ కుట్ర కేసు నుంచి అరవిందఘోష్‌ను నిర్దోషిగా విడుదల చేయించినవారు?    
 - సి.ఆర్.దాస్
 భారతదేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన తొలి ముస్లిం?    - అష్పకుల్లాఖాన్
 దేశంలో తొలిసారి అరెస్టయిన బాలుడిగా స్వాతంత్య్రోద్యమ చరిత్రలో నిలిచినవారు?  
 - ఓరుగంటి రామచంద్రయ్య
 సిన్‌ఫిన్ ఉద్యమం ప్రేరణతో భారత్‌లో జరిగిన ఉద్యమం?    - హోం రూల్ ఉద్యమం
 సహాయ నిరాకరణోద్యమం ఎప్పుడు ప్రారంభమైంది?         
 - 1920, ఆగస్టు 31
 సహాయ నిరాకరణోద్యమ సమయంలో స్థాపించిన విద్యా సంస్థలు?
 - జామియా మిలియా ఇస్లామియా, బిహార్ విద్యాపీఠం, కాశీ విద్యాపీఠం, గుజరాత్ విద్యాపీఠం
 వందేమాతర ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది?          - 1905, అక్టోబర్ 16
 న్యూలాంప్స్ ఫర్ ఓల్డ్, వ్యాస సంపుటి రాసినవారు?    
 - అరవింద ఘోష్
 వందేమాతర ఉద్యమ కాలంలో గోపాల మిత్ర బెంగాల్‌లో ఏర్పర్చిన సంస్థ?
 - వార్షిక హిందూ మేళా
 దక్షిణ భారత్‌లో తొలి ఐూఇ సమావేశం జరిగిన ప్రాంతం?     - మద్రాస్
 ఇంగ్లండ్ పార్లమెంట్‌కు ఎన్నికైన తొలి భారతీయుడు?    - దాదాభాయ్ నౌరోజీ    
 క్విట్ కశ్మీర్ ఉద్యమ నిర్మాత?     - షేక్ అబ్దుల్లా
 శాసనోల్లంఘనోద్యమం ఎప్పుడు ప్రారంభమైంది?         - 1930, మార్చి 12
 బెంగాల్‌ను తిరిగి ఏకీకరించిన సంవత్సరం?         - 1911
 కలకత్తా నుంచి రాజధానిని ఢిల్లీకి మార్చినవారు?    - హార్డింజ్
 రాజాజీ ఫార్ములాను ఎప్పుడు రూపొం
 దించారు?    - 1944
 స్వదేశీ ఉద్యమంలో బాలభారతి సమితి ఎక్కడ ఏర్పడింది?    - రాజమండ్రి
 ‘‘యాచించడం కాదు శాసించాలి’’ అన్నవారు            - లోకమాన్య బాలగంగాధర్ తిలక్
 తిలక్ ప్రచురించిన పత్రికలు?    - కేసరి, మరాఠీ
 త్రివర్ణ పతాకాన్ని మేడం కామా ఎక్కడ ఎగురవేశారు?    - స్టట్‌గర్‌‌ట (జర్మనీ)
 గాంధీజీ దక్షిణాఫ్రికాకు ఎప్పుడు వెళ్లారు?
 - 1893
 మైఖేల్-ఒ-డయ్యర్‌ను ఉద్ధమ్‌సింగ్ ఎప్పుడు చంపాడు?    - 1940
 జామా మసీదు (ఢిల్లీ) ప్రార్థనలో పాల్గొన్న ఆర్యసమాజ నాయకుడు?    - స్వామి శ్రద్ధానంద
 సైమన్ కమిషన్ కాలంలో మద్రాస్‌లో మరణించిన యువకుడు?    - పార్థసారథి
 సైమన్ కమిషన్ ఏర్పడిన సంవత్సరం?
 - 1928  (ఇందులోని సభ్యుల సంఖ్య 7. ఈ కమిషన్ కాలం నాటి వైస్రాయ్ ఇర్విన్)
 జెండా సత్యాగ్రహాన్ని నాగ్‌పూర్‌లో ప్రారంభించినవారు?        - జమ్నాలాల్ బజాజ్    
 కేంద్ర శాసనసభకు స్పీకర్‌గా ఎన్నికైన తొలి భారతీయుడు?    - విఠల్‌భాయ్ పటేల్
 శాసనోల్లంఘనోద్యమ రాణి ఎవరు?
 - సరోజినీ నాయుడు
 గైడిన్‌లియూ ఏ ఉద్యమంలో ప్రసిద్ధి
 పొందారు?    - ఉప్పు సత్యాగ్రహం
 ఖాన్ అబ్దుల్ గఫార్‌ఖాన్ బిరుదు?
 - సరిహద్దు గాంధీ
 ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న గాంధీజీ అనుచరుల సంఖ్య?    - 78
 హరిజనోద్ధరణ ఆంధ్ర శాఖ స్థాపకుడు?
 - కాశీనాథుని నాగేశ్వరరావు
 శారదా నికేతన్‌ను ఉన్నవ లక్ష్మీనారాయణ ఎక్కడ స్థాపించారు?    - గుంటూరు
 కొండా వెంకటప్పయ్య బిరుదు?    - దేశభక్త
 సుభాష్ చంద్రబోస్ ఎక్కడ జన్మించారు?
 - కటక్ (ఒడిశా)
 అండమాన్, నికోబార్ దీవులకు బోస్ పెట్టిన పేర్లు?    - షహీద్, స్వరాజ్
 ది డివైన్ లైఫ్, సావిత్రి గ్రంథాల రచయిత?     
 - అరవింద ఘోష్
 1946 నాటి క్యాబినెట్ మిషన్‌లోని సభ్యులు?- పెథిక్ లారెన్‌‌స, సర్ స్టాఫర్‌‌డ క్రిప్స్, ఎ.వి.అలెగ్జాండర్
 వేల్స్ రాకుమారుడు (8వ ఎడ్వర్‌‌డ) ఇండియాను ఎప్పుడు సందర్శించారు?    - 1921
 భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి భారతీయ వనిత?    -సరోజినీ నాయుడు
 దేశికోత్తమ బిరుదాంకితులు ఎవరు?
 - సురేంద్రనాథ్ బెనర్జీ
 ఏ నియోజకవర్గం నుంచి దాదాభాయి నౌరోజీ బ్రిటన్‌లోని హౌస్ ఆఫ్ కామన్‌‌సకు ఎన్నికయ్యారు? -ప్రిన్‌‌సబరి
 ఫకీర్ మోహన్ సేనాపతి ఏ రాష్ట్రానికి చెందిన జాతీయ కవి?    - ఒడిశా
 కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ (1934) స్థాపకులు?
 - జయప్రకాష్ నారాయణ్, ఆచార్య నరేంద్రదేవ్
 అతివాదులు, మితవాదులు ఎప్పుడు ఏకమయ్యారు?          - 1916
 గాంధీజీ రాసిన ప్రముఖ గ్రంథాలు?
 -మై ఎక్స్‌పెరిమెంట్స్ విత్ ట్రూత్, హింద్ స్వరాజ్
 1921 మోప్లా తిరుగుబాటు (కేరళ) నాయకుడు?    - అలీ ముస్లియార్
 రౌండ్‌టేబుల్ సమావేశాలు మొత్తం ఎన్ని జరిగాయి?     - 3
 అజాద్ హింద్ ఫౌజ్ సైనికుల తరఫున వాదించిన జాతీయ కాంగ్రెస్ న్యాయవాదుల బృందం?  -భూలాభాయ్ దేశాయ్, తేజ్ బహదూర్ సప్రూ, అసఫ్ అలీ
 అజాద్ హింద్ ఫౌజ్ మహిళా విభాగం పేరు?     
 - ఝాన్సీ లక్ష్మీబాయి దళం
 ఝాన్సీ లక్ష్మీబాయి దళానికి నాయకురాలు?    
 - లక్ష్మీ సెహగల్
 ది గ్రేట్ కలకత్తా కిల్లింగ్ ఎప్పుడు జరిగింది?     
 - 1946 ఆగస్టు 16
 ఇండియన్ ఇండిపెండెన్‌‌స బిల్‌ను బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్‌‌స సభలో ప్రవేశపెట్టినవారు?    
       - లిస్టోవెల్
 ఇండియన్ ఇండిపెండెన్‌‌స బిల్‌ను బ్రిటన్  హౌస్ ఆఫ్ లార్‌‌డ్సలో ప్రవేశపెట్టినవారు?
 - లార్‌‌డ శామ్యూల్
 స్వాతంత్య్రం వచ్చేనాటికి భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు?     - జీవత్‌రామ్ భగవాన్‌దాస్ కృపలాని (జె.బి.కృపలాని)    
 వైస్రాయి వెవేల్ 1945లో అఖిలపక్ష సమా వేశాన్ని ఎక్కడ ఏర్పాటు చేశాడు?    - సిమ్లా
 రవీంద్రనాథ్ ఠాగూర్ ఆత్మకథ పేరు?
 - మై రెమినిసెన్సెస్
 ‘యాన్ ఇండియన్ పిలిగ్రిమ్’ రాసినవారు?
 - సుభాష్ చంద్ర బోస్
 పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని నెహ్రూ ఎప్పుడు చేశారు?         - 1929
 చీరాల-పేరాల ఉద్యమం ఏ ఉద్యమంలో భాగం?    -సహాయ నిరాకరణోద్యమం
 విజయవాడ ఐూఇకి పరిశీలకుడిగా హైదరాబాద్ నుంచి వచ్చినవారు?
 - మాడపాటి హనుమంతరావు
 జాతీయోద్యమంలో జైలుశిక్ష అనుభవించిన తొలి తెలుగు వనిత?     -రావూరి అలివేలు మంగమ్మ
 అల్లూరి సీతారామరాజు దాడి చేసిన తొలి పోలీస్‌స్టేషన్?    - చింతపల్లి
 1920లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాను ఎక్కడ స్థాపించారు?        - తాష్కెంట్
 భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను ఎప్పుడు ఉరి తీశారు?          - 1931, మార్చి 23
 ఆనందమండల్ అనే విప్లవ సంస్థ ఎక్కడి నుంచి స్వాతంత్య్రం కోసం పోరాడింది?
 - అహ్మదాబాద్
 1937లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది?    - 8
 1942లో భారత్‌లో పర్యటించిన చైనా అధ్యక్షుడు?    - చాంగ్ -కై-షేక్
 నేతాజీ సింగపూర్‌లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?    -1943 అక్టోబర్ 21
 ఇండియన్ ఇండిపెండెన్‌‌స బిల్లును ఆమోదించిన బ్రిటన్ చక్రవర్తి?    - 6వ జార్జి
 వైస్రాయ్‌గా లార్‌‌డ ఇర్విన్ పాలనా కాలం?
 - 1926-1931
 లార్‌‌డ లిన్‌లిత్‌గో పాలనా కాలం?    -1936-1943
 యుగాంతర్ పత్రికాధినేత?    
 - బరేంద్రకుమార్ ఘోష్
 సచిన్ సన్యాల్ రాసిన గ్రంథం?    - బందీ జీవన్
 మాండలే జైలు నుంచి తిలక్ విడుదలైన సంవత్సరం?         - 1914
 రఫ్త్‌గోఫ్తర్ పత్రికాధినేత?    -దాదాభాయి నౌరోజి
 భారతదేశం నుంచి బర్మా ఏ చట్టం ద్వారా విడిపోయింది?    - 1935 చట్టం
 అమృత బజార్ పత్రిక స్థాపకుడు?
 - శిశిర్ కుమార్ ఘోష్
 జైహింద్, చలో ఢిల్లీ నినాదకర్త?    -నేతాజీ బోస్
 లార్‌‌డ రీడింగ్ పాలనా కాలం?    -1921-1925
 ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్ గ్రంథకర్త ?
 - లాయక్ అలీ
 ‘ది ఎండ్ ఆఫ్ యాన్ ఎరా’ రాసినవారు?
 - కె.యం.మున్షీ
 రెండో ప్రపంచ యుద్ధ కాలంలో భారతీయుల సహాయం కోరుతూ లిన్‌లిత్‌గో చేసిన ప్రకటన?     - ఆగస్ట్ ఆఫర్
 క్యాబినెట్ మిషన్‌ను భారత్‌కు పంపిన ఇంగ్లండ్ ప్రధాని?         - క్లెమెంట్ అట్లీ
 నేతాజీకి సహకరించిన జపాన్ ప్రధాని?
 - టోజో
 హోంరూల్ ఉద్యమాన్ని అనీబిసెంట్ ఎక్కడి నుంచి ప్రారంభించారు?
 - అడయార్ (తమిళనాడు)
 1911లో తొలిసారి ఐూఇలో జాతీయ గీతాలాపన సమయం నాటి ఐూఇ అధ్యక్షుడు?                         - బి.ఎన్.థర్
 కాంగ్రెస్, ముస్లింలీగ్‌ల మధ్య కుదిరిన ఒప్పందం?      - లక్నో ఒప్పందం (1916)
 హరిజనులకు ప్రత్యేక నియోజకవర్గాలపై రామ్సే మెక్‌డొనాల్డ్ చేసిన ప్రకటనను ఏమంటారు?    -కమ్యూనల్ అవార్‌‌డ్స
 ద్విజాతి సిద్ధాంత కర్త?    - మహ్మద్ అలీ జిన్నా
 గాంధీజీ హరిజనులకు ప్రవేశం కల్పించిన దేవాలయం కృష్ణా జిల్లాలో ఎక్కడ ఉంది?         - సిద్ధాంతం అనే ఊరిలో
 నీల్ దర్పణ్ గ్రంథకర్త?    
 - దీనబంధుమిత్ర
 అంబేద్కర్, గాంధీజీల మధ్య జరిగిన ఒప్పందం?    - పూనా ఒప్పందం
 గోఖలే తీర్మానం (1912) ఉద్దేశం?- బడి ఈడు పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య
 గదర్ పార్టీలో చేరిన ఏకైక తెలుగు వ్యక్తి?
 - దర్శి చెంచయ్య
 స్వరాజ్య పార్టీ అధికార పత్రిక?    - ఫార్వర్‌‌డ
 మోతీలాల్ నెహ్రూ 1919లో స్థాపించిన పత్రిక?    - ఇండిపెండెంట్    
 వార్థా విద్యా ప్రణాళికను గాంధీజీ ఎప్పుడు రూపొందించారు?    - 1937
 మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన సిక్కు ప్రతినిధి?    - సంపూరణ్ సింగ్
 మహ్మద్ అలీ జిన్నా ఎప్పుడు ముస్లింలీగ్‌లో చేరాడు?    - 1913
 వేల్స్ రాకుమారుడికి గౌరవ పట్టా ఇచ్చిన యూనివర్సిటీ ? బెనారస్ హిందూ యూనివర్సిటీ
 ప్రిన్‌‌స ఆఫ్ బెగ్గర్‌‌స అని ఎవరిని అంటారు?    - మదన్‌మోహన్ మాలవ్య (బెనారస్ హిందూ యూనివర్సిటీ కోసం కోటిన్నర నిధులు వసూలు చేసినందుకు ఇలా పిలుస్తారు)
 ఖను ఎప్పుడు స్థాపించారు?    - 1925
 ‘ది స్పాట్‌లెస్ పండిట్’ అని ఎవరిని అంటారు?     - మదన్‌మోహన్ మాలవ్య
 ఇండియన్ బిస్మార్‌‌క అని ఎవరిని అంటారు?  
 - సర్దార్ వల్లభాయ్ పటేల్
 హైదరాబాద్‌లో పౌర ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడింది?     - 1950
 హైదరాబాద్ రాజ్యం, భారత యూనియన్‌కు మధ్య యథాతథ ఒప్పందం ఎప్పుడు జరిగింది?      - 1947 నవంబర్ 29
 ట్రావెన్‌కోర్ సంస్థాన రాజధాని?
 - తిరువనంతపురం
 ట్రావెన్‌కోర్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేసినవారు?     
 - బలరామ్ వర్మ (1949లో)
 

మరిన్ని వార్తలు