టీచర్లు రాక.. ప్రార్థన చేయించిన ఎంఈఓ

14 Nov, 2017 12:02 IST|Sakshi
విద్యార్థులతో ప్రార్థన చేయిస్తున్న ఎంఈఓ లక్ష్మణ్‌సింగ్‌

సమయపాలన పాటించకపోవడంతో నోటీసులు జారీ

చిన్నచింతకుంట(దేవరకద్ర):  మండల పరిధిలోని అల్లీపూర్‌ ప్రాథమిక పాఠశాలలో సోమవారం ఎంఈఓ లక్ష్మణ్‌సింగ్‌ విద్యార్థులతో ప్రార్థన చేయించారు. ఆ సమయానికి ఉపాధ్యాయులు ఒక్కరు కూడా రాలేదు. చాలారోజులుగా ఈ పాఠశాల ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదని గ్రామస్తులు ఫిర్యాదు చేశారని ఎంఈఓ తెలిపారు. దీంతో వారిని పలుమార్లు హెచ్చరించినా పనితీరు మారలేదని అన్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశానని, ఉదయం 9:30 అవుతున్నా ఒక్కరు కూడా రాలేదని చెప్పారు. హెచ్‌ఎం.బాలయ్య , ఉపాధ్యాయుడు నాగరాజు, గోపాల్‌కు నోటీసులు జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు