పీసీసీ చీఫ్ల ఎదురీత

16 May, 2014 11:20 IST|Sakshi

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి, తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఇద్దరూ ఎదురీదుతున్నారు. రాష్ట్ర విభజన అనంతరం సీమాంధ్రలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతోంది. అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రఘువీరా వెనుకంజలో ఉన్నారు. ఇక తెలంగాణ ఇచ్చినా ఆ  ప్రాంతంలో సీనియర్ నాయకులు చాలా మంది ఓటమి అంచున ఉన్నారు. వరంగల్ జిల్లా జనగామ నుంచి పోటీ చేసిన పొన్నాల లక్ష్మయ్య వెనుకబడి ఓటమి అంచున ఉన్నారు. మాజీ మంత్రి సునీత లక్ష్మా రెడ్డి ఓడిపోయారు. మరో సీనియర్ నేత వి హనుమంతరావు వెనుకంజలో ఉన్నారు.

మరిన్ని వార్తలు