చంద్రబాబు తీరు చూస్తే సిగ్గేస్తోంది: వీహెచ్

30 Apr, 2014 20:27 IST|Sakshi
చంద్రబాబు తీరు చూస్తే సిగ్గేస్తోంది: వీహెచ్

హైదరాబాద్: బీజేపీకీ రెండు ఓట్లు వేశానని బహిరంగంగా వెల్లడించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై కాంగ్రెస్ నాయకుడు వి. హనుమంతరావు విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబుపై ఉన్న కాస్త గౌరవం పోయిందన్నారు. 9 ఏళ్ళు సీఎంగా పనిచేసిన వ్యక్తి
బీజేపీకి రెండు ఓట్లు వేశానని బహిరంగంగా చెప్పడం సిగ్గుచేటన్నారు.

ఓటు ఎవరికి వేశావని తన తల్లిని అడిగినా చెప్పదన్నారు. చంద్రబాబు తీరు చూస్తే సిగ్గేస్తోందన్నారు. బీజేపీకి ఓటు వేశానని బహిరంగంగా చెప్పడమే కాక ఎన్నికల సంఘం కార్యాలయానికి మనషుల్ని పంపిస్తారా అంటూ వీహెచ్ మండిపడ్డారు.

మరిన్ని వార్తలు