దుబాయ్ నుంచి వచ్చి ఓటేసిన పుజారా

30 Apr, 2014 15:34 IST|Sakshi
దుబాయ్ నుంచి వచ్చి ఓటేసిన పుజారా

రాజ్కోట్: ఐపీఎల్లో కింగ్స్ లెవెన్ పంజాబ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న సౌరాష్ట్ర బ్యాట్స్మన్  చటేశ్వర్ పుజారా విరామం తీసుకుని ఓటు వేసేందుకు గుజరాత్ వచ్చాడు. బుధవారం రాజ్కోట్ నియోజకవర్గంలో పుజారా ఓటు హక్కు వినియోగించుకున్నాడు.

యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్-7లో సోమవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో పుజారా ఆడాడు. గుజరాత్ ఎన్నికల సంఘం బ్రాండ్ అంబాసిడర్గా పుజారా వ్యవహరిస్తున్నాడు. ఐపీఎల్తో పుజారా తీరికలేకున్నా ఉన్నా.. దుబాయ్ నుంచి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుని అందరికీ ఆదర్శంగా నిలిచాడని రాజ్కోట్ కలెక్టర్ రాజేంద్ర కుమార్ ప్రశంసించారు.

మరిన్ని వార్తలు