పులివెందుల టీడీపీలో బయటపడిన విభేదాలు

5 May, 2014 16:22 IST|Sakshi

కడప: వైఎస్ఆర్ జిల్లా పులివెందుల టీడీపీలో ఎన్నికలు సమీపించిన సమయంలో విభేదాలు బయటపడ్డాయి. టీడీపీ అభ్యర్థి సింగారెడ్డి సతీష్‌ కుమార్ రెడ్డి ప్రచార వాహనాన్ని తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి రాంగోపాల్‌రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. దాంతో ప్రచారం మధ్యలోనే  సతీష్‌రెడ్డి వెనుదిరిగి వెళ్లిపోయారు.

పులివెందులలో వైఎస్ఆర్ సిపి తరపున ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తరపున కొనిరెడ్డి రాజగోపాల్ రెడ్డితోపాటు మొత్తం 14 మంది అభ్యర్థులు  పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు