-
గుంటూరు: బీజేపీ కూటమికి రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని సీపీఎం నేత మధు మండిపడ్డారు. ఈ రోజు జిల్లాలోని మంగళగిరి సీపీఎం అభ్యర్థి విజయాన్ని ఆకాంక్షిస్తూ మధు, సీపీఎం రాష్ట కార్యదర్శి రాఘవులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా మీడియాతో మాట్లాడిన మధు.. పవన్ కల్యాణ్ కు రాజకీయ పరిపక్వత లేదని విమర్శించారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ మతోన్మాదానికి ప్రోత్సహిస్తుందన్నారు.
దీనికి పవన్ కల్యాణ్ వత్తాసు పలకడం ఎంతవరకు సబబు అని మధు ప్రశ్నించారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావగా ఆయన అభివర్ణించారు.