జిల్లాకు ఎన్నికల పరిశీలకులు

10 Apr, 2014 02:50 IST|Sakshi

 కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఎన్నికల ఏర్పాట్లను, స రళిని పరిశీలించడానికి సాధారణ పరిశీలకులు జిల్లాకు చేరుకున్నారు. జిల్లాలో ఎన్నికల సరళిని, అభ్యర్థుల ప్రచారాలను, ఏర్పాట్లను పరిశీ లించి నివేదికలివ్వడానికి ఎన్నికల సంఘం ప లువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను  ని యమించింది. వీరిలో సాధారణ పరిశీలకులు గా ఎల్.ఎన్.సోని (9491860465) రాజస్థాన్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి ఈనెల 8 నుంచి ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో బస చేస్తున్నారు.  ఈయనకు లైజన్ అధికారిగా హార్టికల్చర్ ఎ.డి.శామ్యూల్ (8374449355), మరో సాధారణ పరిశీలకులు అశోకానంద హెచ్.ఎ స్.(9491835308) కర్ణాటక క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి,


ఈయనకు లైజన్ అధికారి గా వ్యవసాయ శాఖ ఏడీ వాజిద్‌హుస్సేన్ (సెల్ నం.8886612706) లను నియమించా రు.  జహీరాబాద్ పార్లమెంట్ సాధారణ పరి శీలకులుగా ఐఏఎస్ అధికారి ఎం.తన్నారసన్ (9491860413)ను నియమించారు.  ఈయన కు లైజన్ అధికారిగా డిప్యూటీ ఈఈ సురేష్‌బా బు (9701375988)ను నియమించారు.  పోలీ సు పరిశీలకురాలుగా జార్ఖండ్ రాష్ట్రానికి చెం దిన ఐపీఎస్ అధికారిణి(9491833017), ఈ మెకు లైజన్ అధికారిగా సబ్‌ఇన్‌స్పెక్టర్ అశోక్ (9440055690)ను నియమించారు.

 మరోసాధారణ పరిశీలకులుగా బషరత్ సలీంను నియమించారు. ఈయన జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి, ఈయనకు రామారావునాయక్, ఏడీఏను లైజర్ అధికారిగా నియమించారు. (సెల్‌నం.8886612724). మహా రాష్ట్ర క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి ఎస్.ఎం.కేంద్రీకర్ (9491860441)ను మరో పరి శీలకులుగా నియమించారు.  ఈయనకు లైజ న్ అధికారిగా డిప్యూటీ  ఈఈ టి.భూంరెడ్డి(9701367491)ను నియమించారు.

మరిన్ని వార్తలు