టీడీపీ నేతల ఇళ్లల్లో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు

6 May, 2014 11:00 IST|Sakshi
టీడీపీ నేతల ఇళ్లల్లో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు

కర్నూలు : పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ఓటర్లను మద్యంతో ప్రలోభపెట్టేందుకు టీడీపీ యత్నిస్తోంది. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా మహానంది మండలం సీతారామపురం, బండి ఆత్మకూరు మండలం నారాయణపురంలో తెలుగు దేశం పార్టీ నేతల ఇళ్లల్లో ఎక్సైజ్ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో అక్రమంగా పెద్ద ఎత్తున నిల్వ ఉంచిన మద్యాన్ని అధికారులు గుర్తించారు. మద్యం స్వాధీనం చేసుకున్న అధికారులు వాటిని సీజ్ చేసి, కేసులు నమోదు చేశారు.

 

మరిన్ని వార్తలు