అయిదుగురు సీఎంల రణరంగం

24 Mar, 2014 17:23 IST|Sakshi

ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా అయిదుగురు మాజీ సీఎంలు కర్నాటక ఎన్నికల బరిలో ఉన్నారు. వీరందరూ చాలరన్నట్టు ఇంకో మాజీ సీఎం కూడా రంగంలో దిగేందుకు రెడీగా ఉన్నారు.


మాజీ ప్రధాని, మాజీ సీఎం దేవెగౌడ మరోసారి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రులు ఎన్ ధరమ్ సింగ్, వీరప్పమొయిలీలు తమ తమ నియోజకవర్గాల్లో చెమటోడుస్తున్నారు. ఇక బిజెపి కూడా ఏమీ తక్కువ తినలేదు. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు - సదానంద గౌడ, ఎడియోరప్పలు రంగంలో ఉన్నారు. ఎడియోరప్ప షిమోగా నుంచి, సదానంద గౌడ బెంగుళూరు నార్త్ నుంచి పోటీలో ఉన్నారు.
మరో మాజీ ముఖ్యమంత్రి, దేవెగౌడ సుపుత్రుడు హెచ్ డీ కుమార స్వామి కూడా తాను లోకసభకు పోటీ చేసే అవకాశం ఉందని చెప్పారు. అంటే ఆరో సీఎం కూడా రంగంలోకి దిగుతున్నారన్నమాట.


ఏయే సీఎంలు గెలుస్తారో, ఏయే సీఎంలు ఓడిపోతారో చూడాలి!

మరిన్ని వార్తలు