లగడపాటి సర్వే అంతా బోగస్: షబ్బీర్ అలీ

15 May, 2014 20:16 IST|Sakshi
లగడపాటి సర్వే అంతా బోగస్: షబ్బీర్ అలీ

హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ నిర్వహించిన ఎన్నికల సర్వే అంతా బోగస్ అని కామారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ కొట్టిపారేశారు. తన ఆస్తులను కాపాడుకునేందుకు టీడీపీతో లగడపాటి కుమ్మక్కయ్కారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్కు 50 నుంచి 55 సీట్లు వస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

కామారెడ్డిని సిద్దిపేటలో కలవనివ్వబోమని షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. కామారెడ్డిని జిల్లాగా మార్చి తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. మెదక్ జిల్లా రామాయంపేటను కామారెడ్డిలో కలుపుతామన్నారు.

>
మరిన్ని వార్తలు