హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో అలంపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థుల బి.ఫారాలు తనకు ఇవ్వకుండా టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ప్రచార కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య,తీవ్ర అన్యాయం చేశారని ఆ పార్టీ ఎమ్మెల్యే అబ్రహం ఆరోపించారు.
దళిత ఎమ్మెల్యేకే న్యాయం చేయలేని కాంగ్రెస్... ప్రజలకు ఏం సామాజిక న్యాయం చేస్తుందని ప్రశ్నించారు. టీఆర్ఎస్లో చేరే అంశంపై కార్యకర్తలతో సమావేశమై నిర్ణయం తీసుకుంటానన్నారు. సోమవారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో 50 ఏళ్లలో జరగని అభివృద్ధి తన హయాంలో జరిగిందని, నిన్నగాక మొన్న వేరే పార్టీ నుంచి వచ్చిన వెంకట్రామిరెడ్డికి బి.ఫారాలు ఎలా ఇస్తారని ప్రశ్నించార