స్వతంత్ర అభ్యర్థి ఇంటిపై ప్రత్యర్థులు దాడి

14 May, 2014 08:53 IST|Sakshi

కరీంనగర్ : కరీంనగర్ జిల్లా మెట్పల్లి 7వ వార్డులో మున్సిపల్ అభ్యర్థిగా గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థి ఇంటిపై ప్రత్యర్థులు దాడులు చేశారు. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దాడిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అభ్యర్థి గెలుపుని జీర్ణించుకోలేకే ప్రత్యర్థులు ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.

 

మరిన్ని వార్తలు