మోడీకి కొడుకున్నా.. సీఎంగా చేసేవారు!

11 May, 2014 01:33 IST|Sakshi
మోడీకి కొడుకున్నా.. సీఎంగా చేసేవారు!

వారణాసి: బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ సీఎం నరేంద్ర మోడీకి కుమారుడు ఉంటే.. ఆయన కూడా తన పుత్రుడిని ముఖ్యమంత్రిని చేసేవారంటూ ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్ ఎదురుదాడి చేశారు. యూపీలో తండ్రీకొడుకుల రాజ్యం నడుస్తోందంటూ మోడీ విమర్శించిన నేపథ్యంలో శనివారం వారణాసిలో జరిగిన రోడ్‌షోలో అఖిలేశ్ ప్రతిదాడికి దిగారు. ‘తండ్రీకొడుకుల ప్రభుత్వం చెడ్డదని మోడీ అంటున్నారు.. కానీ ఆయనకు కుమారుడున్నా కూడా అలాగే చేసేవారు’ అని వ్యాఖ్యానించారు.

 వారణాసిలో 250 కెమెరాలను ఏర్పాటు చేసిన ‘ఆప్’

 వారణాసిలో ప్రచారం ముగిసిన నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నగరంలో 250 నిఘా కెమెరాలను ఏర్పాటు చేసింది. డబ్బు, మద్యంతో బీజేపీ కార్యకర్తలు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశాలు ఉండటంతో, వారిపై నిఘా కోసం కెమెరాలను ఏర్పాటు చేశామని ‘ఆప్’ నేత సంజయ్ సింగ్ వెల్లడించారు.
 

మరిన్ని వార్తలు