దేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ త్రీడీ ప్రసంగాలు

7 Apr, 2014 05:47 IST|Sakshi
దేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ త్రీడీ ప్రసంగాలు

న్యూఢిల్లీ: ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న బీజేపీ మరో విన్నూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. నరేంద్ర మోడీ వీడియో ప్రసంగాలను రేపు దేశ వ్యాప్తంగా ప్రసారం చేసేందుకు సన్నాహాలు పూర్తి చేసింది. సోమవారం దేశంలోని 300 ప్రాంతాల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఎన్నికల ఉపన్యాసాలను త్రీడీలో ప్రసారం చేయనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు బీజేపీ తెలిపింది. ఇందుకు గాను సాంకేతిక పరిజ్జానంతో కూడిన పెద్ద తెరలపై ప్రసారం చేస్తామని  ఢిల్లీ బీజేపీ యూనిట్ మీడియా ఇంఛార్జి హరీష్ ఖురానా తెలిపారు.

 

బీజేపీ చేపట్టే ఈ కార్యక్రమంతో దేశంలోని ప్రధాన నగరాలను కవర్ చేసే అవకాశం ఉంటుందని ఆ పార్టీ ఢిల్లీ మాజీ అధ్యక్షుడు విజేందర్ గుప్తా అభిప్రాయపడ్డారు. చిన్న నగరలైన వారణాసి, అలహాబాద్, కాన్పూర్, పాట్నా ల్లోని ప్రజలు ఈ వీడియో ప్రసంగాలను  వీక్షించేందుకు కూడా ఏర్పాట్లు చేసినట్లు బీజేపీ నేతలు తెలిపారు.


 

మరిన్ని వార్తలు