జానారెడ్డిపై ఎన్నికల సంఘానికి నోముల ఫిర్యాదు

21 Apr, 2014 15:16 IST|Sakshi
నోముల నరసింహయ్య - జానారెడ్డి

హైదరాబాద్: నాగార్జున సాగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నోముల నరసింహయ్య తన ప్రత్యర్థి మాజీ మంత్రి జానారెడ్డిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. జానారెడ్డి సాగర్లో  కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

జానారెడ్డి డబ్బు ప్రభావంతో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జానారెడ్డి ఓటర్లను ప్రలోభ పెడ్తున్నాడని నోముల ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు