జమ్మికుంట: తెలంగాణలో సీమాంధ్ర నేతల సభలను బహిష్కరించాలని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన జమ్మికుంటలో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో తమ పెత్తందారీతనాన్ని చెలాయించేందుకు సీమాంధ్ర నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే ఈ ప్రాంతంలో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణలో పుట్టిన ప్రతిబిడ్డ అలాంటి సభలను అడ్డుకోవాల్సిన అవసరముందని తెలిపారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మహబూబ్నగర్లో నిర్వహించిన సభను ఎందుకు అడ్డుకోలేదని టీఆర్ఎస్, టీఎన్జీవో నాయకులను ఆయన ప్రశ్నించారు.