రీ పోలింగ్ ప్రశాంతం

14 May, 2014 03:44 IST|Sakshi
రీ పోలింగ్ ప్రశాంతం

కొమరాడ, న్యూస్‌లైన్ : మండలంలోని చెక్కవానివలస 192వ నంబరు పోలింగ్ బూత్‌లో మంగళవారం జరిగిన రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ నిలిపివేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మంగళవారం రీపోలింగ్ నిర్వహించారు. ఈ బూత్‌లో 217 ఓట్లకుగాను 154 ఓట్లు పోలయ్యూయి. ఎస్‌ఐ ఎ.ధర్మేంద్ర ఆధ్వర్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు.  
 
 పెదచామలాపల్లిలో...
 మెంటాడ : పెదచామలాపల్లిలో 134వ పోలింగ్ బూత్‌లో పార్లమెంటు స్థానానికి సంబంధించి మంగళవారం నిర్వహించిన రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ నెల 7న జరిగిన ఎన్నికల్లో ఇక్కడ ఈవీఎం మొరాయించడంతో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రీపోలింగ్ నిర్వహించారు. సీఐ చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు.  
 

మరిన్ని వార్తలు