జగ్గంపేట టీడీపీలో ముసలం

21 Mar, 2014 14:08 IST|Sakshi
జగ్గంపేట టీడీపీలో ముసలం

జగ్గంపేట: తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట టీడీపీలో ముసలం రాజుకుంది. మాజీ మంత్రి తోట నర్సింహంను పార్టీలో చేర్చుకోవడాన్ని తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తోట నర్సింహంకు జగ్గంపేట సీటిస్తే టీడీపీ తరపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లు ఉపసంహరించుకుంటామని హెచ్చరించారు.

ఇన్నాళ్లు టీడీపీ వ్యతిరేకంగా పనిచేసిన నర్సింహంను ఇప్పుడు ఎలా పార్టీలో చేర్చుకుంటారని జగ్గంపేట టీటీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. 2014 ఎన్నికలే కాదు 2019 ఆ తర్వాత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నుండే పోటీ చేసి గెలుస్తానని నరసింహం గొప్పలు పోయిన విషయాన్ని వారు గుర్తు చేశారు. తోట నర్సింహంకు జగ్గంపేట సీటిస్తే అంగీకరించేది లేదని తెగేసి చెప్పారు.

మరిన్ని వార్తలు