ఆత్మకూరు: వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం ముస్త్యాలపల్లికి చెందిన సిలువేరు భాస్కర్ కుమార్తె జ్యోత్స్నారాణి (25) అనే యువతి జెడ్పీటీసీ ఎన్నికల్లో రంగంలోకి దిగింది. నాలుగేళ్ల క్రితం లండన్ వెళ్లిన ఆమె.. బయోటెక్నాలజీలో ఎంఎస్ చేసి అక్కడే ఉద్యోగంలో చేరారు.
అయితే ఇటీవల స్వగ్రామానికి వచ్చిన ఆమె జెట్పీటీసీ స్థానానికి బరిలో నిలిచారు. తాను జెడ్పీ చైర్పర్సన్ కావాలనే ఉద్దేశంతో పోటీకి దిగానని, తన తండ్రి ప్రోత్సాహంతోనే రాజకీయ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. తాను విజయం సాధిస్తానని ఆమె విశ్వాసం వ్యక్తం చేసింది.