ఈవీఎంల భద్రత ప్రశ్నార్థకంగానే మారుతోంది. మూడంచెల భద్రత ఏర్పాటుచేసినట్లు అధికారులు ఘనంగా చెబుతున్నా, వాస్తవానికి వాటి భద్రత ఏమాత్రం ఉందన్నది అనుమానంగానే కనపడుతోంది.
కృష్ణా జిల్లా విజయవాడలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్దకు పోలీసులు బుధవారం అర్ధరాత్రి ఆరుగురు వ్యక్తులను పంపారు. రిటర్నింగ్ అధికారి అనుమతి లేకుండానే వీరిని అక్కడకు పంపినట్లు తెలుస్తోంది. దీంతో అనుమానాస్పద వ్యక్తులను కొంతమంది నాయకులు గుర్తించి, వారిని పోలీసులకు అప్పగించారు.