టీడీపీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్టే: సోనియా

2 May, 2014 21:16 IST|Sakshi

గుంటూరు: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. టీడీపీ, బీజేపీలు ఒకే నాణేనికి రెండు పార్శాలని విమర్శించారు. శుక్రవారం గుంటూరులో జరిగిన ఎన్నికల ప్రచారసభలో సోనియా పాల్గొన్నారు. బీజేపీ, టీడీపీ పొత్తు అవకాశవాదమని అన్నారు. ఈ రెండు పార్టీలు పాత మిత్రులని,  మరోసారి పొత్తు పెట్టుకుని లౌకిక వాదాన్ని దెబ్బతీసేందుకు వస్తున్నాయని సోనియా ఆరోపించారు. టీడీపీకి ఓటేస్తే, బీజేపీకి వేసినట్టేనని ప్రజలను హెచ్చరించారు. ఈ సభలో ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. కాగా సోనియా సభ జనం లేక వెలవెలబోయింది.

>
మరిన్ని వార్తలు